కలిసికట్టుగాఉందాం: ఎమ్మెస్సార్
శ్రీనగర్: స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల పార్టీని లేదా పార్టీల గ్రూప్ను తాను గుర్తించలేని పరిస్థితిలోనే రాష్ట్రంలో గవర్నర్ పాలన విధించినట్లు జమ్మూ కాశ్మీర్ గవర్నర్ గిరీష్సి. సక్సేనా చెప్పారు.
ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఫరూఖ్ అబ్దుల్లా ఈ నెల 17వ తేదీ తర్వాత కొనసాగడానికి ఇష్టపడలేదని, దీంతో రాజ్యాంగ విధివిధానానికి భంగం వాటిల్లే పరిస్థితి ఏర్పడిందని,అందువల్ల గవర్నర్ పాలన విధించాల్సి వచ్చిందని ఆయనవివరించారు.
అతి పెద్ద పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తారా అని అడిగితేఅసెంబ్లీలో మెజారిటీ సాధించలేని అతి పెద్ద పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం రాజ్యాంగ ధర్మమేమీ కాదని ఆయన జవాబిచ్చారు. ఏర్పాటయిన ప్రభుత్వం శాసనసభలోవిశ్వాసం పొందగలదని తాను సంతృప్తి చెందగలిగి ఉండాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
