వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌ ఘన విజయం,సిరీస్‌ కైవసం

By Staff
|
Google Oneindia TeluguNews

చెన్నై:వెస్టిండీస్‌ పై భారత్‌ సునాయసంగా విజయాన్నిసాధించి మూడు టెస్ట్‌ ల సిరీసీను 2-0తో కైవసంచేసుకొంది. ఇంతకుముందు ఆస్ట్రేలియాపైగెలుపొందిన భారత్‌ వరుసగా సిరీస్‌ నురెండోసారి కైవసం చేసుకోవడం విశేషం. రెండోటెస్ట్‌ లో భారత్‌ విండీస్‌ పై ఎనిమిది వికెట్లతేడాతో గెలుపొందింది.

వెండీస్‌ పై టెస్ట్‌ సిరీస్‌ ను గెలవడం 22ఏళ్ళలో ఇదే ప్రథమం. మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ హర్భజన్‌ సింగ్‌ మరోసారితన ప్రతాపాన్ని చూపించాడు. జహీర్‌ ఖాన్‌ తోకలిసి హర్భజన్‌ వెండీస్‌ టెయిల్‌ ఎండర్స్‌ను వరుసగా పెవిలియన్‌ దారి పట్టించాడు. ఆదివారంనాలుగో రోజు ఆట ప్రారంభించిన వెండీస్‌ నింపాదిగాఆడడం మొదలుపెట్టింది.

గంగూలీకుంబ్లేతో బౌలింగ్‌ ను ప్రారంభించాడు.అయితే, పేస్‌ బౌలింగ్‌ కు పిచ్‌అనుకూలిస్తుండడంతో వెంటనే జహీర్‌ ఖాన్‌కు బౌలింగ్‌ ఇచ్చాడు. కెప్టన్‌ ను గౌరవిస్తూ జహీర్‌ఖాన్‌ ప్రమాదకర బ్యాట్స్‌ మెన్‌ రమేష్‌ శర్వాన్‌ను పెవిలియన్‌ దారి పట్టించాడు. ఆ తర్వాతబౌలింగ్‌ కు దిగిన హర్భజన్‌ తనకు అచ్చొచ్చినచెన్నై నగరంలో విజృంభించాడు. వరుసగారెండు వికెట్లను కూల్చాడు.

హర్భజన్‌ బౌలింగ్‌ లో హిండ్స్‌ భారీ షాట్‌కు ప్రయత్నించి కుంబ్లేకు క్యాచి ఇచ్చి వెనుదిరిగాడు.ఆ తర్వాత బాల్‌ కే బ్రీజ్‌ డకౌట్‌ అయ్యాడు. మెర్విన్‌డిల్లాన్‌ హర్భజన్‌ కు హ్యట్రిక్‌ఛాన్స్‌ రాకుండా నిలువరించినప్పటికీ అతనుకూడా ఎక్కువ సేపు క్రీజ్‌ లో నిలవలేదు. అంపైరింగ్‌తప్పుడు నిర్ణయం వల్ల డిల్లాన్‌ ఔట్‌ కాగా, జహీర్‌ఖాన్‌ బౌలింగ్‌ లో రిడ్లే జాకబ్స్‌ వికెట్‌పారేసుకున్నాడు. 229 పరుగులకు విండీస్‌ఆలౌటింది.

భారత్‌ బ్యాటింగ్‌ కు దిగేముందు మబ్బులుముసురుకోవడంతో విజయం ఆలస్యంఅవుతుందని భావించారు. కానీ సెహ్వాగ్‌ తనసహజ శైలిలో దూకుడుగా ఆడాడు. 2 సిక్సర్లు,మూడు ఫోర్లతో 31 బంతుల్లో 33 పరుగులుచేసి ఔటయ్యాడు. 80 పరుగుల విజయలక్ష్యాన్నిభారత్‌ సునాయసంగా ఛేదించింది. సంజయ్‌బంగర్‌ 20 పరుగుల చేసి ఔట్‌ కాగా, సచిన్‌,ద్రావిడ్‌ లు పనిని పూర్తి చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X