వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నక్సలిజాన్ని అరికట్టండి: చంద్రబాబు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాష్ట్రంలో నక్సలిజం, ముఠాకక్షలు, కుల విద్వేషాలు అభివృద్దికి అవరోధకంగా మారాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఇవి శాంతిభద్రతలకు సవాల్‌ గా మారాయని,వీటిని పూర్తిగా నిర్మూలించాలని చంద్రబాబు నాయుడు పోలీసులకు పిలుపునిచ్చారు.

సోమవారం హైదరాబాద్‌ లో జరిగిన పోలీసుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పోలీసుల త్యాగాలను ఆయన కొనియాడారు.

దేశం మొత్తమ్మీద ఈ ఏడాది విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల సంఖ్య 972 అయితే,అందులో 42 మంది పోలీసులు రాష్ట్రానికి చెందిన వారని ఆయన తెలిపారు. పోలీసులకు అన్ని విధాల తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందని, అడ్డంకులు ఎదురైనా శాంతిభద్రతలను కాపాడడంలో వెనుకాడ వద్దని ఆయన పోలీసులకు ఈ సందర్భంగా సూచించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X