వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నక్సలిజాన్ని అరికట్టండి: చంద్రబాబు

By Staff
|
Google Oneindia TeluguNews

నిజామాబాద్‌: నల్లబెల్లంపై విధించిన ఆంక్షలు ఎత్తేయాలని నిజామాబాద్‌ జిల్లా చెరుకు రైతులు చేపట్టిన రాస్తారోకో హింసాత్మకంగా మారింది. బిక్కనూరు జాతీయ రహదారిపై చెరుకు రైతులు సోమవారం రాస్తారోకో నిర్వహించారు.

ఈ రాస్తారోకో సందర్భంగా పోలీసులు చెరుకు రైతులపై లాఠీఛార్జి చేశారు. తద్వారా చెలరేగిన హింసలో సింగిల్‌ విండో చైర్మన్‌ కోటయ్య తీవ్రంగా గాయపడ్డాడు. కోపోద్రిక్తులైన రైతులు రెండు ఆర్టీసి బస్సులను ధ్వంసం చేశారు. బస్సుల టైర్లలో గాలి తీసేసి, ఒక బస్సుకు నిప్పంటించారు. రైతులు రాళ్లు రువ్వడంతో బస్సు ప్రయాణికులు కూడా గాయపడ్డారు.

జిల్లా పర్యటనకు వచ్చిన నలుగురు మంత్రులను మూడు గంటల పాటు నిలిపేసి, నిలదీశారు. మంత్రులు మండవ వేంకటేశ్వరరావు, నేరెళ్ల ఆంజనేయులు, తుమ్మల నాగేశ్వరరావులను రైతులు కదలనీయలేదు. మంత్రులు హామీ ఇచ్చినప్పటికీ వారు సంతృప్తి చెందలేదు. ఒక రైతు ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు లాఠీఛార్జీ చేసి రైతులను చెదరగొట్టారు. దీంతో మంత్రులు అక్కడి నుంచి సురక్షితంగా బయటపడ్డారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X