వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజకీయ లబ్ధికే ఉగ్రవాదానికి ఊతం

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి పాకిస్థాన్‌ ఉగ్రవాదాన్ని ఉపయోగించుకుంటోందని ఉప ప్రధాని ఎల్‌.కె. అద్వానీ విమర్శించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాలను అంతర్జాతీయ సమాజం వెలి వేయాలని ఆయన కోరారు.

నియంతలు, సైనికాధికారులు పాలించే దేశాలపై అంతర్జాతీయ ఒత్తిడి ఉండవచ్చునని, తాము ఉగ్రవాదాన్ని విశ్వసించడం లేదని, దానిపై పోరాడుతున్నామని కొన్ని సార్లు చెప్పవచ్చునని, అయితే ఐఎస్‌ఐని రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటే తప్పు లేదని అనుకోవచ్చునని ఆయన అన్నారు. ఇండో- టిబెటన్‌ బోర్డర్‌ పోలీసు 41వ రైజింగ్‌ డే కార్యక్రమంలో ఆయన గురువారం ప్రసంగించారు.

ఉగ్రవాదం భారత్‌, అమెరికాలకే కాదు, మొత్తం ప్రపంచానికి, మానవత్వానికి, ప్రజాస్వామ్యాలకు పెను ప్రమాదమని ఆయన అన్నారు. ఈ విషయంలో ప్రపంచం మేల్కోవడం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల ఇండోనేషియాలోని బాలిలో జరిగిన దాడి మరోసారి ఉగ్రవాద ప్రమాదాన్ని ప్రపంచాన్ని తెలియజేసిందని ఆయన అన్నారు.

పాకిస్థాన్‌పై ప్రపంచ ఒత్తిడి ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు ఉపయోగపడుతుందని, అయితే సొంతంగానే మనం ఉగ్రవాదంపై విజయం సాధించగలమని అద్వానీ అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X