వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అద్వానీకి మార్గం సుగమం?
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి పదవి ఉపప్రధాని ఎల్.కె.అద్వానీకి కట్టబట్టే అవకాశం ఉంది. ప్రధాని వాజ్ పేయి ఆరోగ్యపరిస్థితితో పాటు ఇతర విషయాలను దృష్టిలో ఉంచుకొని అద్వానీకి ఆ పదవిని కట్టబెట్టే సమయం ఆసన్నమైందని ఆరెస్సెస్ భావిస్తోంది. గురువారం సాయంత్రం ఆరెస్సెస్ ముఖ్యనేతలు సుదర్శనం తదితరులు ప్రధాని వాజ్ పేయితో సమావేశం కానున్నారు.
ప్రధాని మార్పిడి అంశం గురించి తాము మాట్లాడబోమని వారు స్పష్టం చేస్తున్నప్పటికీ ఢిల్లీలో మాత్రం ఈ విషయం ఇప్పుడు ప్రధానంగా ప్రచారం జరుగుతోంది. ఆరెస్సెస్ లోని ముఖ్యులు పలువురు సీనియర్ జర్నలిస్ట్ ల చెవిలో ఈ విషయాన్ని వేశారు. ఈ సాయంత్రానికి ప్రధాని మారే అవకాశం ఉందని ప్రచారం ఊపందుకొంటుంది.
Comments
Story first published: Thursday, October 24, 2002, 23:53 [IST]