యుపి కాంగ్రెస్‌పై సోనియా ఆశలు

మొరాదాబాద్‌: ఉత్తరప్రదేశ్‌లో తమ పార్టీ పరిస్థితి త్వరలో మెరుగుపడగలదని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ అన్నారు. ఉత్తరప్రదేశ్‌ ప్రజలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనలతో విసిగిపోయి ఉన్నారని ఆమె అన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ను బలపరిచినందుకు ఆమె జమ్మూ కాశ్మీర్‌ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఉత్తరప్రదేశ్‌ ప్రజలు కూడా ఇదే మార్గాన్ని అనుసరిస్తారని ఆమె అభిప్రాయపడ్డారు. మొరాదాబాద్‌లో ఆమె గురువారం సీనియర్‌ కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశంలో ప్రసంగించారు.

జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ) పాలనపై ఆమె తీవ్రంగా ధ్వజమెత్తారు. వారికి అధికారంలో ఉండడమే ముఖ్యమని, అవినీతి, పేదరికాలపై పట్టింపు లేదని ఆమె విమర్శించారు. ఉత్తరప్రదేశ్‌లో అధికారంలో కొనసాగే హక్కు బిఎస్‌పి- బిజెపి ప్రభుత్వానికి లేదని ఆమె అన్నారు. జమ్మూ కాశ్మీర్‌లో పరిస్థితి మారినప్పుడు ఉత్తరప్రదేశ్‌లో కూడా తప్పకుండా మారుతుందని ఆమె అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+