వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొనసాగుతోన్న చెరుకు రైతుల ఆందోళన

By Staff
|
Google Oneindia TeluguNews

అనకాపల్లి, చిత్తూరు: నల్లబెల్లం నిషేధంపై చెరుకు రైతులు ఆందోళన ఉధృతం చేశారు. శనివారం అనకాపల్లిలో మూడు గంటలపాటు రాస్తారోకో, రైల్‌ రోకో నిర్వహించారు. నల్లబెల్లం నిషేధం ఎత్తివేయాలని వారు డిమాండ్‌ చేశారు. రైల్‌ రోకో వల్ల పలు రైళ్ళు నిలిచిపోయాయి. ఇదే రూట్లో విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌ ప్రయాణిస్తోన్న సీఎల్పీ నేత వై.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి రైలు దిగి రైతుల ఆందోళనలో పాలు పంచుకున్నారు.

మరోవైపు, జిల్లాల పర్యటనలో ఉన్న పలువురు మంత్రులను రైతులు అటకాయించి వారిని నిలదీశారు. చిత్తూరు జిల్లాల్లో పర్యటిస్తోన్న మంత్రులు విజయరామరావు, కొత్తపల్లి సుబ్బారాయుడులను చెరుకు రైతులు నిలిపివేసి ధర్నా నిర్వహించారు. వారు ప్రయాణిస్తోన్న కార్లను నిలిపివేసి రోడ్డు మీదే ధర్నా చేయడంతో మదనపల్లి రూట్లో వాహనాలు బారులు తీరి నిలిచిపోయాయి. నాలుగున్నర గంటల పాటు ట్రాఫిక్‌ స్థంభించిపోయింది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X