వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కనీస ఉమ్మడి కార్యక్రమం విడుదల

By Staff
|
Google Oneindia TeluguNews

గౌహతి: అస్సాంలోని కొక్రజార్‌ జిల్లా ఇండో-టిబెట్‌ సరిహద్దులోని ఓ గ్రామంపై తీవ్రవాదులు ఆదివారం ఉదయం మెరుపదాడి చేశారు. తీవ్రవాదులు జరిపిన కాల్పుల్లో 22 మంది గ్రామస్థులు మరణించారు. అనేకమంది తీవ్రంగా గాయపడ్డారు. నేషనల్‌ డెమాక్రటిక్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ బోడోలాండ్‌ కు చెందిన తీవ్రవాదులు తెల్లవారకముందే దాదాగిరి అనే గ్రామంలోకి చొరబడ్డారు. నిద్రపోతున్న గ్రామస్థులపై విచ్చలవిడిగా వారు కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు.

సరిహద్దు ప్రాంతమైన దాదాగిరిలో తీవ్రవాదుల ప్రాబల్యం ఎక్కువగా ఉంది. తీవ్రవాదులు గ్రామస్థులను కాల్చిచంపడానికి గల కారణాలు తెలియరాలేదు. తీవ్రంగా గాయపడిన వారిని ఆస్పత్రిలో చేర్చారు. మరోవైపు, ఈ వార్త తెలుసుకున్న పోలీసులు బాసుగావ్‌ పోలీస్‌ స్టేషన్‌ నుంచి గ్రామానికి వస్తుండగా తీవ్రవాదులు బ్రిడ్జి కింద అమర్చిన బాంబు పేలింది. ఈ ఘటనలో నలుగురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X