వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోస్తాలో బలపడుతోన్న వార్‌

By Staff
|
Google Oneindia TeluguNews

విజయవాడ: విజయవాడలో వన్డే మ్యాచ్‌ కు ఐసిసి ఓకే చెప్పింది. వెస్టిండీస్‌ - భారత్‌ ల వన్డే మ్యాచ్‌ నిర్వహణకు ఐసిసి ఆదివారం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. విజయవాడలోని ఇందిరాగాందీ మున్పిపల్‌ స్టేడియం అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌ నిర్వహణకు కావాల్సిన అర్హతలున్నాయని ఐసిసి స్టేడియం రెఫరీ మైక్‌ ప్రోక్టార్‌ అన్నారు. నవంబర్‌ 24న ఇక్కడ వన్డే మ్యాచ్‌ జరుగుతుంది. విజయవాడలో వన్డే మ్యాచ్‌ నిర్వహించాలని డిమాండ్‌ ఎప్పట్నుంచో ఉన్నప్పటికీ ఐసిసి ఇప్పటికీ ఆమోదం తెలిపింది.

ఆర్నెళ్ళ క్రితం జింబాబ్వే, భారత్‌ ఎలెవన్‌ ల మధ్య ఈ స్టేడియంలో మూడు రోజుల మ్యాచ్‌ జరిగింది. అంతర్జాతీయ హోదా రాకున్నప్పటికీ ఈ స్టేడియాన్ని అంతర్జాతీయ స్థాయిలోనే రూపొందించారు.

ఇక్కడి పిచ్‌ బ్యాటింగ్‌ కు అనుకూలంగా ఉంది. పరుగుల వర్షం కురిసే అవకాశం ఉంది. అన్ని సదుపాలున్నాయని మైక్‌ ప్రోక్టార్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ స్టేడియంలో 30 వేల మంది ప్రేక్షకులు కూర్చొనే సదుపాయం ఉంది. అయితే, మరో పదివేల మందికి సీటింగ్‌ ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో హైదరాబాద్‌, విశాఖపట్నం తర్వాత అంతర్జాతీయ మ్యాచ్‌ నిర్వహణకు అర్హత పొందిన స్టేడియం విజయవాడదే. ఇలా ఒకే రాష్ట్రంలో మూడు అంతర్జాతీయ స్థాయి స్టేడియంలున్న మహారాష్ట్ర తర్వాత ఆంధ్రప్రదేశ్‌ దే.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X