వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కోస్తాలో బలపడుతోన్న వార్
విజయవాడ: విజయవాడలో వన్డే మ్యాచ్ కు ఐసిసి ఓకే చెప్పింది. వెస్టిండీస్ - భారత్ ల వన్డే మ్యాచ్ నిర్వహణకు ఐసిసి ఆదివారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విజయవాడలోని ఇందిరాగాందీ మున్పిపల్ స్టేడియం అంతర్జాతీయ వన్డే మ్యాచ్ నిర్వహణకు కావాల్సిన అర్హతలున్నాయని ఐసిసి స్టేడియం రెఫరీ మైక్ ప్రోక్టార్ అన్నారు. నవంబర్ 24న ఇక్కడ వన్డే మ్యాచ్ జరుగుతుంది. విజయవాడలో వన్డే మ్యాచ్ నిర్వహించాలని డిమాండ్ ఎప్పట్నుంచో ఉన్నప్పటికీ ఐసిసి ఇప్పటికీ ఆమోదం తెలిపింది.
ఆర్నెళ్ళ క్రితం జింబాబ్వే, భారత్ ఎలెవన్ ల మధ్య ఈ స్టేడియంలో మూడు రోజుల మ్యాచ్ జరిగింది. అంతర్జాతీయ హోదా రాకున్నప్పటికీ ఈ స్టేడియాన్ని అంతర్జాతీయ స్థాయిలోనే రూపొందించారు.
Comments
Story first published: Sunday, October 27, 2002, 23:53 [IST]