వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాండ్యాలో జైల్‌భరో-అరెస్టులు

By Staff
|
Google Oneindia TeluguNews

మాండ్యా (కర్ణాటక): తమిళనాడుకు కావేరీ జలాల విడుదలను ఆపేయాలని డిమాండ్‌ చేస్తూ రైతులు సోమవారం జైలు భరో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆందోళనకారులపై పోలీసులు టియర్‌ గ్యాస్‌ షెల్స్‌ వదిలారు. స్వల్పంగా లాఠీఛార్జీ చేశారు. దాదాపు 400 మంది రైతులను పోలీసులు అరెస్టు చేశారు.

మాజీ పార్లమెంటు సభ్యుడు జి. మాదెగౌడ నేతృత్వంలోని కావేరీ రైతుల పరిరక్షణ కమిటీ సమావేశం రైతులు రాళ్లు రువ్విన సంఘటనలకు పాల్పడడంతో హింసాత్మకంగా మారిందని, విధ్వంసానికి దిగిన రైతులను చెదరగొట్టడానికి పోలీసులు టియర్‌గ్యాస్‌ షెల్స్‌ వదిలారని, ఆ తర్వాత స్వల్పంగా లాఠీ చేశారని కర్ణాటక డిజిపి టి. మడియాల్‌ చెప్పారు. తన అనుచరులతో పాటు అరెస్టు సిద్ధపడిన నాయకుడు మాదెగౌడను అదుపులోకి తీసుకోలేదని ఆయన చెప్పారు.

రైతులను నిలువునా ముంచిన ముఖ్యమంత్రి ఎస్‌.ఎం. కృష్ణ రాజీనామా చేయాలని మాదెగౌడ డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి రాజీనామా చేసే వరకు తమ జైలో భరో కార్యక్రమం కొనసాగుతుందని ఆయన హెచ్చరించారు. మాండ్యా, శ్రీరంగపట్నం, మద్దూరు, మాలవల్లి ప్రాంతాల్లో పోలీసులు ఇప్పటికే 144 సెక్షన్‌ విధించారు. రాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌తో పాటు అదనపు పోలీసు బలగాలను మోహరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X