వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాఫ్ట్‌వేర్‌ ఒక్కటే సరిపోదు: కలామ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

బెంగుళూర్‌: సాఫ్ట్‌వేర్‌ మీదనే ఆధారపడడం భవిష్యత్తు దృష్ట్యా తగిన వ్యూహం కాదని రాష్ట్రపతి ఎ.పి.జె. అబ్దుల్‌ కలామ్‌ అన్నారు. భారత్‌లోని ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ పరిశ్రమ ఐటిలో ఎండ్‌-టు- ఎండ్‌ సోల్యూషన్‌ ప్రొవైడర్‌గా అభివృద్ధి చెందాలని ఆయన అన్నారు.

బెంగుళూర్‌ ఐటి డాట్‌ కామ్‌ 2002ను ఆయన సోమవారం ప్రారంభించారు. సాఫ్ట్‌వేర్‌లోనే కాకుండా హర్డ్‌వేర్‌లో కూడా భారత్‌ వరల్డ్‌ లీడర్‌గా ఎదగాలని ఆయన అన్నారు. భారత్‌ ఐటి ప్రొడక్ట్స్‌ నుంచి నాలెడ్జ్‌ ప్రొడక్ట్‌ తయారీ దిశగా ఎదగాలని కూడా ఆయన అన్నారు. సెప్టెంబర్‌ 11వ తేదీ దాడుల అనంతరం భారత్‌లోని ఐటి కంపెనీలు కష్టాల్లో పడ్డాయని ఆయన అన్నారు. ఈ అనుభవం నుంచి భారత్‌ సాఫ్ట్‌వేర్‌ పకడ్బందీగా ఉండాలనేది అర్థమైందని ఆయన అభిప్రాయపడ్డారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనలో 17 దేశాల ఐటి కంపెనీలు పాలు పంచుకుంటున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X