వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఇక రాష్ట్రంలో ఈ-పోలీస్వ్యవస్థ!
హైదరాబాద్: పోలీసు సంస్కరణలో భాగంగా రాష్ట్ర పోలీస్ యంత్రాంగంలో సమూల మార్పులు చేపట్టనున్నారు. పోలీసింగ్ లో ఇక విస్తృతంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఉపయోగించుకోవాలని రాష్ట్ర పోలీసులు భావిస్తున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర డిజిపి పేర్వారం రాములు విలేకరులకు వెల్లడించారు. నిధుల కొరత వల్ల ఇన్నాళ్ళూ సంస్కరణలకు, అధునాతన సౌకర్యాల కల్పనకు వెనుకాడమని ఆయన తెలిపారు.
అయితే, కేంద్ర ప్రభుత్వం నుంచి పోలీస్ వ్యవస్థ ఆధునికీకరణకు ఈ ఏడాది 70 కోట్ల రూపాయల నిధులు వస్తాయని, వీటితో ఇ-కాప్ సిస్టమ్ ను ప్రవేశపెట్టనున్నామని చెప్పారు. కొంత మొత్తం రాష్ట్రప్రభుత్వం కూడా ఇచ్చేందుకు అంగీకరించిందని తెలిపారు.
Story first published: Wednesday, October 30, 2002, 23:53 [IST]