వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాండ్యాలో హింస- కర్ఫ్యూ

By Staff
|
Google Oneindia TeluguNews

మాండ్యా: తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేస్తుందన్నందుకు నిరసనగా రైతులు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారడంతో మాండ్యాలో 24 గంటల కర్ఫ్యూ విధించారు. రైతులు విధ్వంసానికి దిగారు, పోలీసులపైకి రాళ్లు విసిరారు. ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు టియర్‌ గ్యాస్‌ షెల్స్‌ వదిలారు, లాఠీఛార్జీ చేశారు.

జిల్లావ్యాప్త బంద్‌, రైతు నాయకుల రిలే నిరాహారదీక్ష ప్రారంభమైన తర్వాత కొద్ది గంటలకే ఆందోళనకారులు హింసకు దిగారు. పోలీసులపైకి రాళ్లు విసరడంతో పాటు రెవెన్యూ శాఖకు చెందిన రెండు జీప్‌లను దగ్ధం చేశారు. అంతకు ముందు నిషేధాజ్ఞలను ఉల్లంఘించి రైతులు రోడ్ల మీద ట్రాఫిక్‌ను అడ్డుకున్నారు. వరుసగా మూడో రోజు రైళ్లను, బస్సులను నడపలేదు. ఈ నెల 31వ తేదీ నుంచి రైళ్ల రాకపోకలను రద్దు చేస్తున్నట్లు దక్షిణ రైల్వే ప్రకటించింది. పరిస్థితి ఉద్రిక్తతంగా ఉంది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X