ఆంధ్రలో అపార చమురు నిల్వలు

ముంబాయి: గోదావరి- కృష్ణా బేసిన్‌లో రిలయన్స్‌ సంస్థ అపారమైన చమురు నిల్వలను కనుగొన్నది. ఈ నిల్వలు దేశ ఇంధన సరఫరా ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులనే మార్చే అవకాశాలున్నాయి. బొంబాయి హై ఫీల్డ్‌లో కన్నా ఈ నిల్వలు 40 శాతం అధికమని అంచనా వేశారు. దీంతో చమురు, సహజ వాయువుల సంస్థ మొత్తం సహజవాయువు ఉత్పత్తి ద్విగుణీకృతమవుతుంది.

గోదావరి- కృష్ణా బేసిన్‌లో చమురు నిల్వలను కనుగొన్న విషయాన్ని అంబానీలు గురువారం తమ కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రకటించారు. కృష్ణా- గోదావరి బేసిన్‌లోని చమురు నిల్వలను వెలికి తీయడానికి ఏడు వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తుందని రిలయన్స్‌ సంస్థకు చెందిన ముఖేష్‌ అంబానీ ప్రకటించారు. కృష్ణా- గోదావరి బేసిన్‌లోని నిల్వల వల్ల దేశంలోని సహజవాయువు ఉత్పత్తి 60 శాతం పెరుగుతుందని అంచనా. ఇక చమురును దిగుమతి చేసుకోవాల్సిన అవసరం దేశానికి ఉండదు. ఈ నిల్వలకు తమ తండ్రి ధీరూబాయ్‌ అంబానీ పేరు పెట్టినట్లు ముఖేష్‌ అంబానీ చెప్పారు. కృష్ణా- గోదావరి బేసిన్‌లోని నిల్వల గురించి ప్రకటించిన వెంటనే రిలయన్స్‌ షేర్‌ ధర 14 శాతం పెరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+