నదుల లింక్‌పైసుప్రీం ఆదేశాలు

న్యూఢిల్లీ: దేశంలోని ప్రధాన నదుల అనుసంధానం ప్రాజెక్టును 2012 నాటికి పూర్తి చేయడానికి ఒక టాస్క్‌ఫోర్సును ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ప్రాజెక్టును 2043 నాటికి పూర్తి చేయాలన్న కేంద్ర లక్ష్యాన్ని తీవ్రంగా పరిగణించింది.

నేషనల్‌ రివర్‌ నెట్‌వర్క్‌కు అవసరమైన విధానాలు టాస్క్‌ఫోర్సు రూపొందించాలని ప్రధాన న్యాయమూర్తి బి.ఎన్‌.కృపాల్‌, జస్టిస్‌ వై.కె. సబర్వాల్‌, జస్టిస్‌ అరిజిత్‌ పసాయత్‌లతో కూడా సుప్రీంకోర్టు బెంచ్‌ సూచించింది. ఈ విషయాన్ని రాష్ట్రపతి, ప్రధాని వ్యక్తిగత దృష్టి సారించారని కేంద్రం తరఫున అటార్నీ జనరల్‌ సోలి సొరాబ్జి సుప్రీంకోర్టుకు తెలియజేశారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించిందని, ఈ ప్రాజెక్టుకు 5,60,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయని, ఈ నిధుల సమీకరణే సమస్యగా ఉన్నదని ఆయన చెప్పారు. ఈ విషయంపై డిసెంబర్‌ 16వ తేదీన ప్రభుత్వ స్పందనను తెలియజేయాలని కోర్టు ఆదేశించింది.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+