కాంగ్రెస్‌, పిడిపిలపై వెంకయ్య ధ్వజం

హైదరాబాద్‌: జమ్మూ కాశ్మీర్‌లో కాంగ్రెస్‌- పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ (పిడిపి) సంకీర్ణం ప్రజాకర్షక విధానాలను అనుసరిస్తోందని, ఇది వ్యతిరేక ఫలితాలను ఇస్తుందని, జాతీయ ప్రయోజనాలను దెబ్బ తీస్తోందని భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధ్యక్షుడు ఎం. వెంకయ్యనాయుడు అన్నారు.

స్పెషల్‌ ఆపరేషన్‌ గ్రూప్స్‌ను తొలగించడం, ఉగ్రవాదుల విడుదలతో పాటు పొటో వాడకంపై పరిమితుల వంటి నిర్ణయాలు సానుకూలమైనవి కావని ఆయన అన్నారు. పార్టీ రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశంలో ఆయన గురువారం మాట్లాడారు. ఈ విధమైన నిర్ణయాలు మన ప్రయోజనాలకు తీవ్ర ప్రమాదకరమైనవని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో పిడిపి కన్నా కాంగ్రెస్‌దే ఎక్కువ తప్పు ఉన్నదని ఆయన అన్నారు. ఇవన్నీ రాజకీయ నిర్ణయాలని ఆయన అన్నారు. ప్రజాకర్షక విధానాల ద్వారా రాజకీయ లబ్ధి పొందడాన్ని సమర్థించుకోవడానికి బదులు జమ్మూ కాశ్మీర్‌లోని ఉగ్రవాద సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు ప్రయత్నించి ప్రజల తీర్పును కొత్త ప్రభుత్వం గౌరవించాలని వెంకయ్యనాయుడు అన్నారు.

కాంగ్రెస్‌, వామపక్షాల ద్వంద్వ వైఖరులపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. బిజెపి రాజకీయ వెసులుబాటు చాలా ఉన్నదని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రచారం చేయడం ద్వారా, ప్రతిపక్షాల ద్వంద్వ వైఖరులను ఎత్తి చూపడం ద్వారా ఆ వెసులుబాటును పొందాలని ఆయన ఆయన పార్టీ కార్యకర్తలకు సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+