అల్పపీడన ద్రోణి: కోస్తాలో వర్షాలు
విశాఖపట్నం: బంగాళఖాతంలోదక్షిణ దిశగా అల్పపీడన ద్రోణి ఏర్పడింది. దీంతో గురువారం కోస్తాంధ్రజిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి.బుధవారం రాత్రి ఏర్పడిన ద్రోణి వల్ల గురువారంఉదయం నుంచి కోస్తా అంతటా జల్లులు మొదలయ్యాయి.
ఈ సీజన్ లో ఇప్పటికీ సరిగావర్షాలు చూడని ఈ జిల్లాల ప్రజలు గురువారంనాటి వర్షాలతో ఆనందంలో మునిగారు. విశాఖపట్నంలోఉదయం నుంచి భారీగా వర్షం పడడంతో లోతట్టుప్రాంతాల్లో నీరు నిలిచింది. ట్రాఫిక్ అస్తవ్యస్తంగామారింది. పలు ప్రాంతాల్లో చెరువులు, కుంటలు నిండుతున్నాయి. ఈ ద్రోణి మరింత బలపడితే, ఇంకావిస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణకేంద్రం ఉదయం ఓ ప్రకటనలో తెలిపింది.












Click it and Unblock the Notifications