వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సిపిఐతో టిఆర్ఎస్ దోస్తీ లేనట్లే!
Posted on 20-11-03
విజయవాడ: తాము సమైక్యాంధ్ర రాష్ట్రానికి కట్టుబడి ఉన్నామని సిపిఐ నాయకుడు దాసరి నాగభూషణరావు అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కోరుతున్నవారితో తమకు ఏ విధమైన అవగాహన ఉండదని ఆయన గురువారం విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్ర సమితితో సిపిఐ ఎన్నికల పొత్తు కుదుర్చుకుంటుందనే వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో దాసరి నాగభూషణరావు ప్రకటన వెలువడింది. దీన్ని బట్టి సిపిఐ టిఆర్ఎస్తో ఏ విధమైన పొత్తుకు సిద్ధంగా లేదని తేలిపోయింది. టిఆర్ఎస్తో పొత్తు పెట్టుకోబోమని మరో వామపక్ష పార్టీ సిపిఎం బుధవారంనాడే స్పష్టం చేసింది. కాంగ్రెస్, టిఆర్ఎస్, వామపక్షాలు వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయనే ప్రచారానికి దీంతో తెరపడింది.
Comments
Story first published: Thursday, November 20, 2003, 23:53 [IST]