వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అస్సాం హింసపై లాలూకు పిఎం హామీ

By Staff
|
Google Oneindia TeluguNews

Posted on 20-11-03

పాట్నా: అస్సాంలో బీహారీలపై జరుగుతున్న హింసాకాండను సమర్థంగా ఆపుతామని ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి రాష్ట్రీయ జనతాదళ్‌ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు హామీ ఇచ్చారు.

అస్సాంకు మరిన్ని కేంద్ర బలగాలను పంపుతామని ప్రధాని చెప్పారు. వాజ్‌పేయితో టెలిఫోన్‌లో మాట్లాడిన అనంతరం లాలూ ప్రసాద్‌ యాదవ్‌ బుధవారంవిలేకరులతో ఆ విషయాలు చెప్పారు. శాంతిసారస్యాలను, సహోదరత్వాన్నిపెంపొందించడానికి అస్సాంకు అదనపు బలగాలను పంపాలని తాను ప్రధానిని కోరినట్లు ఆయన తెలిపారు.

అస్సాంలో బీహారీల హత్య పట్ల తాను దిగ్భ్రాంతికి గురయ్యానని ప్రధాని అన్నట్లు ఆయన చెప్పారు.అస్సాంలోని బీహారీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాపాడాలని తాను ప్రధానితో చెప్పానని ఆయన అన్నారు. హింసకు వెంటనేస్వస్తి చెప్పాల్సిన అవసరం ఉన్నదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X