వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
చిత్తూరుజిల్లాలో రోడ్డు ప్రమాదం: 9 మంది మృతి
చిత్తూరు:చిత్తూర జిల్లా పీలేరు వద్దమంగళవారం తెల్లవారు జామునుజరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తొమ్మిదిమంది మరణించారు.గాయపడినవారిని పీలేరు ప్రభుత్వఆస్పత్రిలో చేర్చారు. అనంతరం చెన్నైఆస్పత్రికి చేర్చారు. గాయపడినవారిలోఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.ఎదురెదురుగా వస్తున్న లారీ, జీపుఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది.జీపును క్లీనర్ తోలుతుండడంవల్లనే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్షసాక్షులు అంటున్నారు. మరణించినవారులారీ నుంచి టమాటాలు అన్లోడ్ చేసే కూలీలు అనిసమాచారం. మృతుల కుటుంబ సభ్యులుపీలేరుకు చేరుకున్నారు. ఈసంఘటనతో అక్కడ విషాద వాతావరణంనెలకొంది.
Comments
Story first published: Tuesday, March 1, 2005, 23:53 [IST]