విశాఖలో సునామీఅధ్యయన కేంద్రానికి పరిశీలన
న్యూఢిల్లీ:రాష్ట్రంలోని విశాఖపట్నంలో సునామీ అధ్యయనకేంద్రం ఏర్పాటుకు కేంద్ర సైన్స్,టెక్నాలజీ మంత్రి కపిల్ సిబాల్సుముఖత వ్యక్తం చేశారు. ఈ విషయాన్నిమహబూబ్నగర్ పార్లమెంట్సభ్యుడు విఠల్రావు విలేకరులతోచెప్పారు. విఠల్ రావు, రాష్ట్రపర్యాటక శాఖ మంత్రి జె. గీతారెడ్డిమంగళవారంనాడు కపిల్సిబాల్ను కలిశారు. విశాఖపట్నంలో సునామీఅధ్యయన కేంద్రం ఏర్పాటుకు ఉన్నఅవకాశాలను పరిశీలించడానికి త్వరలోనిపుణులను పంపుతామని సిబాల్చెప్పినట్లు విఠల్ రావు చెప్పారు.రాష్ట్రంలో షుగర్ టెక్నాలజీ మిషన్ఏర్పాటుకు సహకరిస్తామని కూడా కపిల్సిబాల్ చెప్పినట్లు గీతారెడ్డితెలిపారు.
మూతపడిన చెరుక పరిశ్రమలనుతెరిపించడానికి ఆర్థిక సహాయంఅందిస్తామని కేంద్ర వ్యవసాయ మంత్రిశరద్ పవార్ హామీ ఇచ్చినట్లు గీతారెడ్డితెలిపారు. ఈ విషయమై శరద్పవార్ను కలిసి మాట్లాడినట్లు ఆమెతెలిపారు. రాష్ట్రంలో చెరుకు నిల్వలు చాలాఉన్నాయని, వాటిని అమ్మగలిగితే చెరుకురైతుల బకాయిలు తీర్చగలమని, ఆప్కాబ్రుణం తీర్చగలమని, అందుకు సాయంఅందిస్తామని శరద్ పవార్ చెప్పారనిఆమె వివరించారు.