ఎన్కౌంటర్లు:ఒక నక్సల్ హతం, జవానుకు గాయాలు
హైదరాబాద్:వరంగల్ జిల్లా తాడ్వాయిలో మావోయిస్టునక్సలైట్లు అటవీ శాఖ అతిథి గృహాన్నిపేల్చివేశారు. అనంతరం పోలీసులకు,మావోయిస్టులకు మధ్య జరిగినఎదురుకాల్పుల్లో సెంట్రల్ రిజర్వ్ పోలీసుబలగం (సిఆర్పియఫ్) జవాను గజేంద్రగాయపడ్డాడు.
దాదాపు20 మంది సాయుధ నక్సలైట్లు అటవీశాఖఅతిథిగృహాన్ని క్లైమోర్ మైన్స్తోపేల్చివేశారు. అతిథి గృహం పూర్తిగాధ్వంసమైంది. విషయం తెలిసినవెంటనే పోలీసులు సంఘటనా స్థలానికిచేరుకున్నారు. ఈ సమయంలో ఇరుపక్షాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.దాదాపు పది నిమిషాల పాటు ఈ ఎదురు కాల్పులుజరిగాయి. గాయపడిన జవానునువరంగల్లోని యంజియం ఆస్పత్రిలోచేర్చారు. సంఘటనా స్థలం నుంచక్లైమోర్ మైన్స్ను, కిట్ బ్యాగ్నుపోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఎదురుకాల్పుల్లో నక్సలైట్లు కూడాగాయపడినట్లు సమాచారం. కాల్పులుజరుపుతూ నక్సలైట్లు పారిపోయారు.నక్సలైట్లు మొదట పేలుడు పదార్థాలుప్రయోగించారు. అనంతరం కాల్పులుజరిపారు.
ఆదిలాబాద్జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఒక నక్సలైట్మరణించాడు. నక్సలైట్లు తమసానుభూతిపరులతో మాట్లాడుతుండగాఈ సంఘటన జరిగింది. మరణించిననక్సలైట్ను మావోయిస్టు ఇంద్రవెల్లిదళసభ్యుడిగా గుర్తించారు.విశాఖపట్నం జిల్లా జికె వీధి గరికబండ సమీపంలోపోలీసులకు, నక్సలైట్లకు మధ్యఎదురుకాల్పులు జరిగాయి.
ఇదిలావుంటే,మహబూబ్నగర్ జిల్లా ఆమ్రాబాద్లోకాంగ్రెస్ నాయకుడి గ్యాస్ సిలిండర్గోడవున్ను పేల్చివేశారు.