వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వైఎస్ప్రభుత్వానికి పోయే కాలం:కళ్యాణ్రావు
హైదరాబాద్:రాష్ట్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డిప్రభుత్వానికి తుది ఘడియలుసమీపించాయని విప్లవ రచయిత, మావోయిస్టుల ప్రతినిధి కళ్యాణరావుఆగ్రహంగా అన్నారు. నిజామాబాద్ జిల్లా మానాలఅడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లోమరణించిన పదిమంది మావోయిస్టులమృతదేహాలను దర్శించేందుకు బయలుదేరిన కళ్యాణరావు, బండప్రకాష్, పద్మ తదితర ముప్పై మందిని మెదక్ జిల్లా తూప్రాన్లోపోలీసులుఅరెస్టు చేసి, మూడు గంటల తర్వాతవిడుదల చేశారు. రెండో విడత చర్చలుజరగకుండా చూసేందుకే పోలీసులు ఈబూటకపు ఎన్కౌంటర్ చేశారని వారువిమర్శించారు. ముఖ్యమంత్రిరాజశేఖరరెడ్డి, డిజిపి స్వరణ్జిత్సేన్లు రాష్ట్రాన్ని స్మశానంగా మారుస్తున్నారనివారు ఆరోపించారు.
Comments
Story first published: Tuesday, March 8, 2005, 23:53 [IST]