ఉగాండాసేద్యంపై విమర్శ, మంత్రి వివరణ
హైదరాబాద్:ఉగాండా, కెన్యా దేశాలకు రైతులనుపంపిచడం వెనుక వ్యాపార ప్రయోజనాలు ఉన్నాయన్నవిమర్శలు వస్తున్నాయని, దీనిపై ప్రభుత్వంసమాధానమివ్వాలని టిడ్పి సీనియర్ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ బుధవారం అసెంబ్లీలో కోరారు.రైతులను ఉగాండా, కెన్యాలకు పంపించివ్యవసాయం చేయించాలన్నది ఒక ఆలోచనమాత్రమేనని దీనిపై తుది నిర్ణయం తీసుకోలేదనివ్యవసాయ మంత్రి రఘువీరారెడ్డిసమాధానమిచ్చారు. ప్రభుత్వ సలహాదారుసిసి రెడ్డి నాయకత్వంలోని ఒక కమిటీఇప్పటికే ఆ దేశాల్లో పర్యటించి నివేదికనుసమర్పించిందని, భద్రత సహా అన్నిఅంశాలను పరిశీలించిన తర్వాతేరైతులను పంపించే విషయంపై తుది నిర్ణయంతీసుకుంటామన్నారు. మనరాష్ట్రానికి చెందిన కొంద రు ఉగాండా,కెన్యాలలో డిస్టిలరీలు పెట్టారని, వాటికికావలసిన మొలాసిస్ కోసమే ఆంధ్రరైతులను అక్కడికి తరలించి చెరకుపండించాలని యోచిస్తున్నారని పయ్యావులకేశవ్ విమర్శించారు.