వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మార్క్ఫెడ్ ముందు టిడిపి ఎమ్యెల్యేల ధర్నా
హైదరాబాద్/ వరంగల్: పత్తి, మిర్చి కొనుగోలు చేయనందుకు నిరసనగా తెలుగుదేశం శాసనసభ్యులు హైదరాబాద్లోని మార్క్ఫెడ్ కార్యాలయం వద్దకు ధర్నాకు దిగారు. మిర్చి కొనుగోలు చేయాలని రైతులు గుంటూరు జిల్లాలోనూ, వరంగల్ జిల్లాలోనూ ఆందోళనలకు దిగుతున్నారు.
మిర్చిని కొనుగోలు చేయనందుకు ఆగ్రహం చెందిన రైతులు శుక్రవారంనాడు వరంగల్లో ఆందోళనకు దిగారు. మిర్చి కుప్ప పోసి దగ్ధం చేశారు. ఈ సందర్భంగా రైతులకు, పోలీసులకు మధ్య వాగ్వివాదం చెలరేగింది. మిర్చి కొనుగోలుకు మార్క్ఫెడ్ ముందుక రాకపోతే తమ ఆందోళనను ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు. ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంపై రైతులు తీవ్ర విమర్శలు చేశారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో ముఖ్యమంత్రి విఫలమవుతున్నారని వారన్నారు.
Comments
Story first published: Friday, April 1, 2005, 23:53 [IST]