వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఇద్దరిని కాల్చి చంపిన నక్సలైట్లు
హైదరాబాద్: గుంటూరు జిల్లాలో మావోయిస్టు నక్సలైట్లు ఒక వ్యక్తిని ఇన్ఫార్మర్ నెపంతో కాల్చి చంపారు. గుంటూరు జిల్లా రెడ్డివారిపాలెంలో శాంతయ్య అనే వ్యక్తిని మావోయిస్టులు కాల్చి చంపారు. ఆరుగురు సాయుధ నక్సలైట్లు ఇంటికి వచ్చి శాంతయ్యను బయటకు రావాల్సిందిగా అడిగారు. అందుకు శాంతయ్య నిరాకరించాడు. దీంతో శాంతయ్యను నక్సలైట్లు విపరీతంగా కొట్టారు. ఆ తర్వాత కాల్చి చంపారు. అడ్డు వచ్చిన శాంతయ్య భార్య లక్ష్మిపై కూడా నక్సలైట్లు చేయి చేసుకున్నారు.
అనంతపురం జిల్లా కంబదూర్ మండలం నూతిమడుగు గ్రామంలో మావోయిస్టు నక్సలైట్లు ఎంపిటిసి అక్కులప్పను కాల్చి చంపారు.
Comments
Story first published: Sunday, May 22, 2005, 23:53 [IST]