వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అద్వానీ సహాయం కోరిన ముషార్రఫ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్‌: భారత్‌తో శాంతి చర్చల ప్రక్రియను కొనసాగించడానికి పాకిస్థాన్‌ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషార్రఫ్‌ భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధ్యక్షుడు లాల్‌ కృష్ణ అద్వానీ, బిజెపి సహకారాన్ని కోరారు. వారం రోజుల పాకిస్థాన్‌ పర్యటనలో ఉన్న అద్వానీ ముషార్రఫ్‌తో సమావేశమయ్యారు. దాదాపు గంట సేపు ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. భారత్‌, పాక్‌ల మధ్య శాంతి ప్రక్రియపైననే ఇరువురి మధ్య చర్చలు జరిగాయి.

అద్వానీకి ముషార్రఫ్‌ సాదర ఆహ్వానం పలికారు. అద్వానీ సింధు ప్రొవిన్స్‌లోని హైదరాబాద్‌లో జన్మించారు.. కరాచీలోని సెయింట్‌ పాట్రిక్‌ హైస్కూల్‌లో ఆయన విద్యాభ్యాసం సాగింది. ముషార్రఫ్‌ కూడా ఇక్కడే చదువుకున్నారు. కరాచీలోని పాఠశాల రోజలను వారిరువురు నెమరేసుకున్నారు.

భారత పాక్‌ల మధ్య సంబంధాలు మెరుగుపడే దిశలో అన్ని సమస్యలూ పరిషారం కాగలవని, జమ్మూ కాశ్మీర్‌ సమస్య కూడా పరిష్కారమవుతుందని పాకిస్థాన్‌ ప్రధాని షౌకత్‌ అజీజ్‌ అద్వానీతో చెప్పారు. అజీజ్‌తో ఆయన 40 నిమిషాల పాటు సమావేశమయ్యారు. తన పర్యటన ప్రస్తుతం కొనసాగుతున్న శాంతి ప్రక్రియకు బలం చేకూరుస్తుందని అద్వానీ విలేకరులతో అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X