సచివాలయంలో దిగిన వైయస్ హెలికాప్టర్
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని సచివాలయంలో ముఖ్యమంత్రి హెలికాప్టర్ దిగడానికి ఏర్పాటయిన హెలిపాడ్ వినియోగంలోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి ఆదివారంనాడు హెలికాప్టర్లో హైదరాబాద్కు తిరిగి వచ్చి నేరుగా సచివాలయంలో దిగారు. ఈ హెలిపాడ్ నిర్మాణాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రతిపాదించారు. అయితే అది నిర్మాణ రూపం ధరించలేదు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత దాని నిర్మాణాన్ని పూర్తి చేసి వినియోగంలోకి తెచ్చారు.
ఇంతకు ముందు ముఖ్యమంత్రి హెలికాప్టర్ బేగంపేటలో దిగేది. అక్కడి నుంచి ముఖ్యమంత్రి కారులో సచివాలయానికి వచ్చేవారు. దాని వల్ల ట్రాఫిక్ సమస్య ఎదురుతోందనే ఉద్దేశంతో సచివాలయంలో హెలిపాడ్ నిర్మాణాన్ని చేపట్టారు. రాష్ట్ర సచివాలయాల్లో దేశంలోని ఐదారు చోట్ల హెలిపాడ్లు ఉన్నాయి.