తెనాలిలో కాంగ్రెస్ బాహాబాహీ: ఎన్నిక వాయిదా
తెనాలి: పార్లమెంటు సభ్యుడు బాలశౌరి, శాసనసభ్యుడు నాదెండ్ల మనోహర్ వర్గాల మధ్య తీవ్ర విభేదాలు చోటు చేసుకోవడంతో తెనాలి మున్పిపాలిటీ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. కమీషనర్ కార్యాలయంలో ఇరు వర్గాల మధ్య బాహాబాహీ జరిగింది. అక్కడ రణరంగంగా మారింది. ఈ ఘర్షణలో మనోహర్ స్వల్పంగా గాయపడ్డారు.
శాసనసభ్యుడు నాదెండ్ల మనోహర్ 20 మంది కౌన్సిర్లతో క్యాంపు నిర్వహించడాన్ని పార్లమెంటు సభ్యుడు బాలశౌరి తీవ్రంగా విమర్శిస్తున్నారు. పోలీసులను కూడా మున్సిపల్ కార్యాలయానికి తెచ్చారని ఆయన ఆరోపించారు. సీతామహలక్ష్మిని చైర్ పర్సన్ చేయాలని నాదెండ్ల మనోహర్ ప్రయత్నిస్తుండగా, మస్తానయ్యకే చైర్మన్ పదవి దక్కాలని బాలశౌరి పట్టుబడుతున్నారు. సమయానికి కౌన్సిలర్లెవరూ సమావేశానికి హాజరు కాకపోవడంతో కమీషనర్ ఎన్నికను వాయిదా వేశారు. అయితే మనోహర్ వర్గానికే మెజారిటీ ఉన్నట్లు తమకు సమాచారం ఉందని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు హైదరాబాద్లో ఉన్నారు.