అసెంబ్లీ: బిసి స్కాలర్షిప్లపై టిడపి పట్టు
హైదరాబాద్: వెనకబడిన తరగతుల (బిసి) స్కాలర్షిప్ల మంజూరుపై తెలుగుదేశం పార్టీ సభ్యులు గురువారం కొద్దిసేపు శాసనసభా కార్యక్రమాలను స్తంభింపజేశారు. బిసి స్కాలర్షిప్ల మంజూరు అంశంపై తక్షణ చర్చకు అనుమతించాలంటూ తెలుగుదేశం పార్టీ వాయిదా తీర్మానం ప్రతిపాదించింది. దీన్ని స్పీకర్ కె. ఆర్. సురేష్ రెడ్డి తోసిపుచ్చారు. అయితే చర్చకు అనుమతించాల్సిందేనంటూ తెలుగుదేశం పట్టింది. స్పీకర్ పోడియం వద్ద తెలుగుదేశం సభ్యులు బైఠాయించారు.
ఈ సమయంలో ఆర్థిక మంత్రి కె. రోశయ్య జోక్యం చేసుకుని - బిసి స్కాలర్షిప్ల విషయంలో ఏ విధమైన అన్యాయం చేయడం లేదని చెప్పారు. అవసరమనుకుంటే ఈ అంశంపై చర్చించేందుకు అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. స్కాలర్షిప్ల విషయంలో బిసి విద్యార్థులు 36 ధర్నాలు చేశారని, ఇది 3 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిందని దేవేందర్ గౌడ్ అన్నారు. దేవేందర్ గౌడ్ మాట్లాడుతుంటే ప్రధానమైన అంశం కాబట్టి తాను జోక్యం చేసుకుని సమాధానం ఇచ్చానని, దానిపై చర్చకు అనుమతించడం సరి కాదని రోశయ్య అన్నారు.
షెడ్యూల్ కులాల ( ఎస్సి) రిజర్వేషన్ల వర్గీకరణపై చర్చకు బిజెపి వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించింది. దాన్ని కూడా స్పీకర్ తోసిపుచ్చారు.