వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పులిచింతలను నిర్మించి తీరుతాం: పొన్నాల లక్ష్మయ్య
హైదరాబాద్: కృష్ణానదిపై పులిచింతల ప్రాజెక్టును నిర్మించి తీరుతామని, గోదావరి నదిపై తలపెట్టిన పోలవరం ప్రాజెక్టుకు అనుమతులు సాధిస్తామని భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. ప్రతిపక్ష సభ్యులు వేసిన ప్రశ్నలకు శుక్రవారం శాసనసభలో సమాధానమిస్తూ ఆయన ఆ విషయం చెప్పారు.
పులిచింతల ప్రాజెక్టుపై ఈ నెల 10వ తేదీన ప్రభుత్వ తలపెట్టిన ప్రజాభిప్రాయసేకరణ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) డిమాండ్ చేసింది. ఈ డిమాండ్ను మంత్రి త్రోసిపుచ్చారు. పులిచింతల ప్రాజెక్టు కింద ముంపునకు గురయ్యే ప్రాంతాలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని ఆయన చెప్పారు. ముంపు లేకుండా ప్రపంచంలో ఎక్కడా ప్రాజెక్టుల నిర్మాణ జరగదని ఆయన అన్నారు.
Comments
Story first published: Friday, October 7, 2005, 23:53 [IST]