వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

170 జీవోను రద్దు చేయాల్సిందే: వెంకటస్వామి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: కార్మిక సంఘాలు సమ్మెను విరమించుకుంటాయని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎపియస్‌ఆర్టీసి) చైర్మన్‌ గోనె ప్రకాశరావు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ రాత్రి ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డితో కార్మిక సంఘాల నాయకులు సమావేశమవుతున్నారని, ఈ సమావేశంలో పరిష్కారం లభించవచ్చునని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఆర్టీసిని ప్రైవేటీకరించబోమని, కార్మికులను తొలగించబోమని ముఖ్యమంత్రి స్పష్టంగా హామీ ఇచ్చారని, అందువల్ల సమ్మెను కార్మిక సంఘాలు విరమించుకోవాలని ఆయన అన్నారు.

సమ్మె అనివార్యమైతే ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. సమ్మెలో పాల్గొనే కార్మికులను వేధించబోమని, అయితే ఇబ్బందులు కలిగిస్తే సహించబోమని ఆయన అన్నారు. విధుల్లో చేరే కార్మికులకు తగిన రక్షణ కల్పిస్తామని ఆయన చెప్పారు.

తమ డిమాండ్ల విషయంలో ఏ మాత్రం రాజీపడబోమని కార్మిక సంఘాల నాయకులు అంటున్నారు. ఈ నెల 18వ తేదీ నుంచి సమ్మె చేయాలని కార్మిక సంఘాలు నిర్ణయించుకున్నాయి. ఆర్టీసి బకాయిలను సగం తగ్గించాలని, డీజిల్‌పై అమ్మకం పన్ను తగ్గించాలని తాము డిమాండ్‌ చేస్తున్నట్లు సంఘాలు తెలుపుతున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X