వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిడిపి బ్లాక్‌మెయిల్‌కు తలొగ్గం: రఘువీరా

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ఎల్లంపల్లి ప్రాజెక్టు ఫైళ్లను స్పీకర్‌ ముందుంచాలనే తెలుగుదేశం పార్టీ సభ్యుల డిమాండ్‌కు తలొగ్గేది లేదని వ్యవసాయ శాఖ మంత్రి ఎన్‌. రఘువీరా రెడ్డి స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతోందని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. తాము ఉప్పూ కారం తింటున్నామని, వారు ఫైళ్లు పెట్టమంటే పెడతామా అని ఆయన అడిగారు. తమను స్పీకర్‌ సంజాయిషీ అడగడమే ప్రతిపక్షాల విజయమని ఆయన అన్నారు.

కమ్యూనిస్టులను చూస్తే జాలి వేస్తోందని, కమ్యూనిస్టు పార్టీలు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) తెలుగుదేశం పార్టీ ట్రాప్‌లో పడిపోయాయని ఆయన వ్యాఖ్యానించారు. కమ్యూనిస్టులు వాస్తవాలు గుర్తించి తప్పును తెలుసుకునే రోజు వస్తుందని ఆయన అన్నారు. ఏవో రెండు కాగితాలు తెచ్చి తెలుగుదేశం పార్టీవారు అవే రుజువులు అని చెబుతుంటే కమ్యూనిస్టులు నిజమే కావచ్చునని ఆనుకుంటున్నాయని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X