వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీవారికి ఎంపీ రూ. 4 కోట్ల వజ్రాభరణాలు

By Staff
|
Google Oneindia TeluguNews

తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయానికి చిత్తూరు పార్లమెంటు సభ్యుడు ఆదికేశవులు నాయుడు నాలుగు కోట్ల రూపాయల విలువ చేసే వజ్రాభరణాలను బహూకరించారు. వీటిని శ్రీ శృంగేరి పీఠాధిపతి చేతుల మీదుగా శ్రీవారికి ప్రదానం చేయించారు. వజ్రాలు పొదిగిన కటి హస్తం, అమ్మవారికి మంగళ సూత్రాలు, ముక్కు పుడక బహూకరించారు.

తాను తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) చైర్మన్‌గా పని చేసినప్పుడు వాటిని చేయిస్తానని మొక్కుకున్నానని, ఇప్పుడు ఆ మొక్కు తీర్చుకున్నానని ఆదికేశవులునాయుడు శుక్రవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఆ వజ్రాభరణాలను ఆయన మీడియా ప్రతినిధులకు చూపించారు. శ్రీ కృష్ణ దేవరాయాల కాలంలో చేయించిన మంగళసూత్రాలే ఇప్పటికీ ఉన్నాయని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X