రాజ్నాథ్ను కలిసిన తెరాస నేత కెసిఆర్
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అగ్రనేత కె. చంద్రశేఖర్ రావు బుధవారంనాడు భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ను కలుసుకున్నారు. ఆయనతో పాటు మరో అగ్రనేత, కేంద్ర మంత్రి ఎ. నరేంద్ర, పార్టీ పార్లమెంటు సభ్యలు ముగ్గురు రాజ్నాథ్ సింగ్ను కలిశారు. తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేసినందుకు ధన్యవాదాలు తెలపడానికే తాను రాజ్నాథ్ సింగ్ను కలిసినట్లు చంద్రశేఖర్ రావు చెప్పారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు బిజెపి అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ పూర్తి మద్దతు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు పార్లమెంటులో బిల్లు ప్రతిపాదిస్తే తాము బలపరుస్తామని ఆయన చెప్పారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు పట్ల యుపిఎ ప్రభుత్వం నిర్లిప్త వైఖరిని ప్రదర్శిస్తోందని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు బిజెపి వైఖరి స్పష్టం కాకపోవడమే ప్రధాన అడ్డంకి అని చెప్పిన కాంగ్రెస్ ఇరకాటంలో పడ్డట్టయింది.