వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పంచాయతీ ఎన్నికల కోసమే యాత్రలు: సిపియం
హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల కోసమే రాష్ట్ర ప్రభుత్వం రైతు చైతన్య యాత్రలు తలపెట్టిందని సిపియం శాసనసభా పక్ష నాయకుడు నోముల నర్సింహయ్య విమర్శించారు. ఈ రైతు చైతన్య యాత్రల వల్ల ఈ విధమైన ప్రయోజనం లేదని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
ఈ రైతు చైతన్య యాత్రలు మూడు నెలల క్రితం మొదలు పెట్టి ఉంటే ప్రయోజనం చేకూరి ఉండేదని ఆయన అన్నారు. ఈ యాత్రలు అధికారుల గ్రామ యాత్రలుగా మారాయే తప్ప రైతులను చైతన్యవంతులను చేయలేకపోతున్నాయని ఆయన అన్నారు. గ్రామాల్లో తిరుగుతున్న అధికారులకు ఏ విధమైన అధికారాలు లేవని ఆయన అన్నారు.
Comments
Story first published: Wednesday, April 5, 2006, 23:53 [IST]