వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గంగవరంపై అఖిలపక్ష సమావేశం ప్రారంభం
విశాఖపట్నం: గంగవరం బాధితులపై ఎట్టకేలకు శనివారం సాయంత్రం అఖిల పక్ష సమావేశం ఏర్పాటైంది. వాణిజ్య పన్నుల శాఖ మంత్రి కొణతాల రామకృష్ణ అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభమైంది. గుర్తింపు పొందిన పార్టీలను మాత్రమే అఖిల పక్ష సమావేశానికి అనుమతిస్తామని ప్రభుత్వం మొదట ప్రకటించడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తాము సమావేశాన్ని బహిష్కరిస్తున్న అఖిల పక్ష నేతలు ప్రకటించారు. మత్స్యకారుల ఐక్య వేదిక నాయకులు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా తలపెట్టారు. దీంతో ప్రభుత్వం దిగి వచ్చింది. రాజకీయ పార్టీల నుంచి ఇద్దరేసి ప్రతినిధులను, ఐక్య వేదిక నుంచి 25 మంది ప్రతినిధులను సమావేశానికి అనుమతించడానికి ప్రభుత్వం అంగీకరించింది. దీంతో సమావేశం ప్రారంభమైంది.
Story first published: Saturday, April 8, 2006, 23:53 [IST]