వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎమ్యెల్యేపై దాడికి నక్సల్స్‌ విఫలయత్నం

By Staff
|
Google Oneindia TeluguNews

ఒంగోలు: ప్రకాశం జిల్లా కంభం శాసనసభ్యుడు ఉడుముల శ్రీనివాస రెడ్డిపై మావోయిస్టులు శనివారం దాడికి విఫలయత్నం చేశారు. శ్రీనివాస రెడ్డి ప్రయాణిస్తున్న కారుపై మావోయిస్టులు బాంబులతో దాడి చేశారు. ప్రకాశం జిల్లా అర్థవీడు మండలం కాకర్ల గ్రామం వద్ద ఈ దాడి జరిగింది. శనివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

ఈ దాడి నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారు. ఆయన కారు మాత్రం ధ్వంసమైంది. మావోయిస్టులు దాడి చేసిన వెంటనే ఎమ్యెల్యే అంగరక్షకులు ఎదురుకాల్పులు జరుపుతూ ఆయనను అక్కడి నుంచి తప్పించారు. ఆయన అక్కడి నుంచి కంభం తీసికెళ్లారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X