వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎమ్యెల్యేపై దాడికి నక్సల్స్ విఫలయత్నం
ఒంగోలు: ప్రకాశం జిల్లా కంభం శాసనసభ్యుడు ఉడుముల శ్రీనివాస రెడ్డిపై మావోయిస్టులు శనివారం దాడికి విఫలయత్నం చేశారు. శ్రీనివాస రెడ్డి ప్రయాణిస్తున్న కారుపై మావోయిస్టులు బాంబులతో దాడి చేశారు. ప్రకాశం జిల్లా అర్థవీడు మండలం కాకర్ల గ్రామం వద్ద ఈ దాడి జరిగింది. శనివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
ఈ దాడి నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారు. ఆయన కారు మాత్రం ధ్వంసమైంది. మావోయిస్టులు దాడి చేసిన వెంటనే ఎమ్యెల్యే అంగరక్షకులు ఎదురుకాల్పులు జరుపుతూ ఆయనను అక్కడి నుంచి తప్పించారు. ఆయన అక్కడి నుంచి కంభం తీసికెళ్లారు.
Comments
Story first published: Saturday, April 8, 2006, 23:53 [IST]