వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రెండు జిల్లాల్లో ఎదురుకాల్పులు: నక్సలైట్ మృతి
వరంగల్/ఆదిలాబాద్: రాష్ట్రంలోని రెండు జిల్లాల్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎన్కౌంటర్లు జరిగాయి. వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ప్రాణనష్టం ఏమీ సంభవించలేదు. ఆదిలాబాద్ జిల్లా కెరిమెరి అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో నార్నూర్ మావోయిస్టు దళ కమాండర్ మరణించాడు.
వరంగల్ జిల్లా తాడ్వాయి అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టులు పోలీసులకు గురి చూసి మందుపాతర పేల్చారు. అనంతరం మావోయిస్టులు పారిపోయారు. శుక్రవారం సాయంత్రం ఇదే ప్రాంతంలో ఇరుపక్షాలకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టుల ప్లీనరీని భగ్నం చేశారు. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు. ఇదే ప్రాంతంలో శనివారం సాయంత్రం ఎన్కౌంటర్ జరిగింది.
Comments
Story first published: Saturday, April 8, 2006, 23:53 [IST]