వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముస్లిం కోటాపై ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ముస్లిం రిజర్వేషన్ల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నుంచి ఎదురు దెబ్బ తగిలింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ముస్లింలకు ఐదు శాతం రిజర్వేషన్లను అమలు చేయడానికి అనుమతించాలని కోరుతూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది.

రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం అంత తొందరపడాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. తమ విచారణ పూర్తయ్యేవరకు ఓపిక పట్టాలని ప్రభుత్వానికి సూచించింది. విద్య, ఉద్యోగాల్లో ముస్లింలకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు చెల్లవంటూ మొదట హైకోర్టు తీర్పు చెప్పింది. అయితే సుప్రీంకోర్టులో అపీల్‌ చేసుకోవడానికి అవకాశం కల్పించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X