ఈతకని వెళ్లి ఐదుగురు చిన్నారుల మృతి
కడప: కడప జిల్లాలో ఈతకు వెళ్లి ఐదుగురు చిన్నారులు మునిగి దుర్మరణం పాలయ్యారు. రెండో చోట్ల బుధవారం ఈ సంఘటనలు చోటు చేసుకున్నాయి. కడప జిల్లా మైదుకూరు మండలం తువ్వపాలెంలో చెరువులో మునిగి ముగ్గురు బాలికలు మరణించారు. రామాపూర్ గ్రామంలో దిగుడు బావిలో మునిగి ఇద్దరు బాలురు మరణించారు. ఈతకని వెళ్లి ఈత రాకపోవడంతో వారు మరణించారు. ఈ సంఘటనలతో మృతి చెందిన చిన్నారుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.












Click it and Unblock the Notifications
