కానిస్టేబుల్ను చితకబాదిన ఆర్మీ జవాన్లు
హైదరాబాద్: రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్పై ఆర్మీ జవాన్లు దౌర్జన్యకరంగా ప్రవర్తించారు. ఆర్పియఫ్ కానిస్టేబుల్ గోవిందరాజులను ఆర్మీ జవాన్లు చితకబాది పారిపోయారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద పార్కింగ్ నిర్వహణ కోసం ఉన్న గోవిందరాజులు అనే కానిస్టేబుల్ను ఆర్మీ జవాన్లు కొట్టారు. ఆర్మీ జవాన్ల కోసం కేటాయించిన స్థలంలో కాకుండా మరో చోట ఒక జవాను తన వాహనాన్ని పార్క్ చేయడాన్ని వ్యతిరేకించినందుకు ఆర్మీ జవాన్లు ఆ చర్యకు దిగారు.
తన వాహనం పార్కింగ్ను అడ్డుకున్నందుకు జవాను తన మిత్రులతో కలిసి గోవిందరాజులు వద్ద ఉన్న లాఠీని లాక్కుని చితకబాదారు. దీంతో గోవిందరాజులు సంఘటనపై గోపాలపురం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గోవిందరాజులును చితకబాదిన జవాన్లను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని సికింద్రాబాద్లోని గోపాలపురం పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ చెప్పారు.