రావాల్సిన అప్పు అడిగినందుకు హత్య
హైదరాబాద్: తమకు ఇవ్వాల్సిన డబ్బులు అడిగినందుకు హైదరాబాద్లోని బంజారాహిల్స్లో ఒక వ్యక్తిని కొట్టి చంపారు. కొండయ్య అనే వ్యక్తి రాము అనే వ్యక్తికి వేయి రూపాయలు ఇవ్వాల్సి ఉంది. రాము కొండయ్యను ఆ డబ్బులు అడిగాడు. దాంతో రామును కొండయ్య, అతని మిత్రులు తీవ్రంగా కొట్టారు.
తన బావమరిది రామును కొట్టారని తెలుసుకున్న బావ మల్లేష్ కొండయ్య వద్దకు వెళ్లాడు. దీంతో కొండయ్య మనుషులు మల్లేష్ను కూడా తీవ్రంగా కొట్టారు. దీంతో మల్లేష్ మరణించాడు. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications
