వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మావోయిస్టుల కాల్పుల్లో న్యూడెమొక్రసీ నేత మృతి

By Sridhar L
|
Google Oneindia TeluguNews

ఖమ్మం: మావోయిస్టుల కాల్పుల్లో గాయపడిన న్యూడెమొక్రసీ నాయకుడు ఇర్ఫాన్‌ ఖాజా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారంనాడు మరణించాడు. ఖమ్మం జిల్లా గుండాల మండలం మార్కోడు గ్రామం వద్ద న్యూడెమొక్రసీ నేత ఇర్ఫాన్‌ ఖాజాపై మావోయిస్టులు సోమవారం కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఖాజా తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించారు.

ఇల్లందు అటవీ ప్రాంతంలో తమ ఉద్యమాన్ని దెబ్బ తీయడానికే మావోయిస్టులు ఈ కాల్పులు జరిపారని న్యూడెమొక్రసీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇల్లందు ప్రాంతంలో న్యూడెమొక్రసీ బలంగా ఉంటుంది. ఇల్లందు శాసనసభ నియోజకవర్గం నుంచి న్యూడెమొక్రసీకి చెందిన గుమ్మడి నర్సయ్య గెలిచారు. ఈ ప్రాంతంలో మావోయిస్టులు తమ పట్టు కోసం ప్రయత్నిస్తుండడంతో ఇరు పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరు పార్టీల మధ్య గత కొంత కాలంగా ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X