వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆచూకీ తెలియని నాగార్జున సిబ్బంది

By Sridhar L
|
Google Oneindia TeluguNews

విజయవాడ: కృష్ణా జిల్లా జి. కొండూరు మండలం కడెం పోతవరం గ్రామం వద్ద నిర్మాణంలో ఉన్న ఒక ప్రైవేట్‌ కంపెనీ సిబ్బందిని కిడ్నాపర్లు ఇంకా వదిలి పెట్టలేదు. వారి ఆచూకీ కూడా ఇంతవరకు తెలియడం లేదు. నిర్మాణంలో వున్న నాగార్జున సిమెంట్స్‌ లిమిటెడ్‌ జనరల్‌ మేనేజర్‌ రామారాజు, పర్సనల్‌ ఆఫీసర్‌ గాలిబ్‌లతో సహా ముగ్గురు సిబ్బందిని గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం సాయంత్రం కిడ్నాప్‌ చేశారు.

నాగార్జున సిమెంట్స్‌ సిబ్బందిని అపహరించినవారు మావోయిస్టులు అయి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. వారిని ఖమ్మం జిల్లా కొత్తగూడెం ప్రాంతంలో దాచి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కిడ్నాపర్లు సిబ్బందిని వదలడానికి కోటి రూపాయలు డిమాండ్‌ చేసినట్లు సమాచారం. కిడ్నాపర్ల కోసం హైదరాబాద్‌, ఖమ్మం, కృష్ణా జిల్లాల పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కిడ్నాప్‌నకు సంబంధించిన సమాచారం తమకు ఆలస్యంగా అందిందని కృష్ణా జిల్లా పోలీసు సూపరింటిండెంట్‌ (యస్పీ) అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X