ప్రేమ పెళ్లి కోసం లోకేశ్వరి కిడ్నాప్ కథ
విశాఖపట్నం: అనకాపల్లి జిల్లా పరిషత్ ప్రాదేశిక కమిటీ (జడ్పిటిసి) సభ్యురాలు బి. లోకేశ్వరి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. ప్రేమ వివాహం చేసుకుని ఆమె తిరిగి వచ్చింది. తాను ప్రేమించిన సత్యగోవింద్ను పెళ్లి చేసుకోవడానికే ఇంటి నుంచి వెళ్లిపోయానని లోకేశ్వరి పోలీసులకు చెప్పింది. తామిద్దరమూ మేజర్ అని చెప్పి, తమకు స్వేచ్ఛగా వ్యవహరించే హక్కు ఉందని ఆమె పోలీసులకు చెప్పింది. దీంతో వాంగ్మూలం తీసుకొని పోలీసులు ఆమెను వదిలిపెట్టారు.
తమ కూతురు కిడ్నాప్నకు గురైందంటూ ఈ నెల 17వ తేదీన లోకేశ్వరి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 16వ తేదీ రాత్రి లోకేశ్వరి కనిపించకుండా పోయింది. అయితే లోకేశ్వరికి ఏ విధమైన ప్రాణాపాయం ఉండదని, తమ డిమాండ్లను తర్వాత తెలియజేస్తామని రాసిపెట్టిన చిట్టీని మాత్రం పోలీసులు కనిపెట్టారు. ఆ తర్వాత పోలీసులు ఆమె కోసం వేట ప్రారంభించారు. పోలీసులు యానాంలో ఫోన్ ట్యాప్ చేసి లోకేశ్వరి ఉన్న స్థలాన్ని గుర్తించారు. దీంతో ఆమెను అనకాపల్లికి తీసుకొచ్చారు.