వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మిలిటెంట్ల కాల్పులకు ఇద్దరు జవాన్ల బలి
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు కేంద్ర రిజర్వ్ పోలీసు బలగాల (సిఆర్పియఫ్) జవాన్లు బలి అయ్యారు. ఈ సంఘటన శ్రీనగర్లోని పర్యాటక ప్రాంతం దాల్గేట్లో మంగళవారం ఉదయం జరిగింది. మిలిటెంట్లు జవాన్లపైకి అతి సమీపం నుంచి కాల్పులు జరిపారని పోలీసు వర్గాలు చెప్పాయి.
మిలిటెంట్ల కాల్పుల్లో గాయపడిన ఇద్దరు జవాన్లను ఆస్పత్రిలో చేర్చారు. అయితే వారు చికిత్స పొందుతూ మరణించారు. ఈ చర్యకు పాల్పడింది ఏ ఉగ్రవాద సంస్థ అనేది తెలియడం లేదు. ఏ సంస్థ కూడా ఇప్పటి వరకు ఈ సంఘటనపై ప్రకటన చేయలేదు.
Story first published: Tuesday, August 1, 2006, 23:53 [IST]