బస్సు కాలువలో పడి 7గురు పిల్లల మృతి
సోనేపట్: హర్యానాలోని సోనేపట్ ప్రాంతంలో గల ఆవ్లినా గ్రామ సమీపంలో ఒక స్కూలు బస్సు కాలువలో పడిపోవడంతో ఏడుగురు పాఠశాల పిల్లలు మరణించారు. మరో 32 మంది గాయపడ్డారు. ఈ బస్సులో దాదాపు 41 మంది దాకా పిల్లలు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు 8 శవాలను వెలికి తీశారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా వుంది. పది మందిని సహాయక బృందాలు సజీవంగా వెలికి తీశాయి.
పిల్లలందరూ సోనేపట్ దాత్ - కుంభ గ్రామంలోని గీతా విద్యామందిర్ పాఠశాలకు చెందినవారు. బస్సు పిల్లలతో పాఠశాలకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. బస్సును వెలికి తీయడానికి క్రేన్ను తెప్పించారు. కాలువలో నీటిని తగ్గించి సహాయ చర్యలను చేపట్టడానికి నీటి ప్రవాహాన్ని ఆపేశారు.












Click it and Unblock the Notifications
