వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఇన్ఫార్మర్ నెపంతో ఒకరిని చంపిన నక్సల్స్
వరంగల్: వరంగల్ జిల్లాలో ఇన్ఫార్మర్ అనే నెపంతో మావోయిస్టులు ఒక వ్యక్తిని హత్య చేశారు. వరంగల్ జిల్లా కొత్తూరు మండలం తిరుమలగండి మండలంలో వెంకన్న అనే వ్యక్తిపై మావోయిస్టులు దాడి చేశారు. ఈ దాడిలో వెంకన్న తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా అతను మరణించాడు.
సంఘటనా స్థలం వద్ద మావోయిస్టులు ఒక లేఖను వదిలివెళ్లారు. పోలీసులకు ఇన్ఫార్మర్గా వ్యవహరించినందుకే వెంకన్నను చంపామని, ఇన్ఫార్మర్గా వ్యవహరించేవారు ఎవరైనా వారికి ఇదే గతి పడుతుందని ఆ లేఖలో మావోయిస్టులు హెచ్చరించారు.
Comments
Story first published: Sunday, August 6, 2006, 23:53 [IST]